PDPL: ధర్మారం ఎంపీడీవో కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటుపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మధ్యలో బడి మానివేయడం, బాలల అక్రమ రవాణా, వేధింపులను అరికట్టుటకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో ఎస్సై ప్రవీణ్ కుమార్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.