AP: CM చంద్రబాబు కడప జిల్లా ఒంటిమిట్ట పర్యటన షెడ్యూల్ ఖరారయింది. కోదండ రామాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కళ్యాణంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా రామయ్యకు రాష్ట్రప్రభుత్వం తరఫున ఆయన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. CM పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై సహచర మంత్రులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.