SRCL: వేములవాడకు అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ కనెక్టివిటీని పెంచాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆర్టీసీ సమస్యలపై శనివారం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల ప్రజాప్రతినిధులతో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు.