NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి పై సంకటహర చతుర్థి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. ఆర్జిత సేవల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రద్దీ నియంత్రణకు రూ.500 టికెట్లు, అంతరాలయ దర్శనం నిలిపివేశారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈవో శీనానాయక్ పరిశీలించి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.