అన్నమయ్య: ప్రజల భద్రతను లక్ష్యంగా పెట్టుకుని జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు గ్రామాల్లో పర్యటించి సైబర్ నేరాలు, మహిళా భద్రతపై ప్రజలకు వివరించారు. అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై తనిఖీలు నిర్వహించి ఈ-చలాన్లు విధించారు. ప్రజలు చట్టాలను పాటించి భద్రతకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.