ASR: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు వచ్చే దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీసీ నిర్వహించారు. సీఎం డ్యాష్ బోర్డు ద్వారా అందిన అప్లికేషన్లను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యను గుర్తించాలన్నారు.