నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భానుడి ప్రతాపం తీవ్రమవుతోంది. వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా గూడూరు, పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన ఎండ గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.