CTR: బైరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లె ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి పదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలకు ఎంపిక జరుగుతుందన్నారు. ఏప్రిల్ 30వ తేదీ లోపు ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి అని ఆయన ప్రకటించారు.