SKLM: జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. గురువారం నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం హయంలో నిరుద్యోగులకు ప్రైవేటు రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు.