తూ.గో: రాజమండ్రి రూరల్ కొంతమూరు సబ్స్టేషన్ పరిధిలో RDSS పనుల కోసం బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. అంబేద్కర్ పేట, బ్రాహ్మణ అగ్రహారం, క్వారీ ఏరియా, అఫీషియల్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటులో ఉండదు. మరమ్మతులు సకాలంలో పూర్తి చేయడానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.