ప్రకాశం: పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెం గ్రామ సమీపంలో సోమవారం RTC పల్లె వెలుగు బస్సు అదుపుతప్పి పొలాలలోకి దూసుకు వెళ్ళింది. ప్రమాదంలో బస్సులో ఉన్న 35 మంది సురక్షితంగా బయటపడ్డారు. స్టీరింగ్లో సాంకేతిక లోపం తలెత్తి బస్సు మలుపు తిరగలేదని బస్సు డ్రైవర్ తెలిపాడు. బస్సు కందుకూరు నుంచి కనిగిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.