పల్నాడు: పెదకూరపాడులో ఈస్టర్ పండుగను పురస్కరించుకొని సమాధుల తోటలను పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే తమ పితరుల సమాధుల వద్ద అగరవత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థన చేశారు. సుదూర ప్రాంతాల్లో నుంచి స్వగ్రామాలకు చేరుకొని సమాదుల తోటలో కొంత సమయం గడిపి తమ పితరులతో జ్ఞాపకాలను పంచుకున్నారు. కాగా నజరేయుడైన ఏసు పునరుద్దానుడై మూడవరోజు తిరిగి లేచాడని వారి నమ్మకం.