కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కీలక చర్యలు చేపట్టారు. ఆదివారం కరప, కాకినాడ రూరల్ ప్రాంతాల మత్స్యకారులకు బోట్లు, వలలు, ఇంజన్లు, ఆటోలు, ఐస్ బాక్సులను పంపిణీ చేశారు. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా లబ్ధిదారులకు పరికరాలు అందజేశారు.