కడప జిల్లాలో ఎర్రగుంట్ల పరిధిలోని జువారి లేబర్ కాలనీలో పోలీసులు “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో రికార్డులు లేని 16 ద్విచక్ర వాహనాలు, 8 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు.