సత్యసాయి: పెనుకొండ సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పరిస్థితిపై ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో పెనుకొండ డీఎస్పీ, సీఐలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు కీలక సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.