VSP: జీవీఎంసీ పరిధిలో ఆస్తిపన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ అందుబాటులో ఉందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. మార్చి 31లోగా పన్నులు ఒకేసారి చెల్లిస్తే ఈ సదుపాయం పొందవచ్చన్నారు. వార్డు సచివాలయాలు, బ్యాంకులు, జీవీఎంసీ కార్యాలయాల్లో చెల్లింపులు చేయవచ్చని సూచించారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.