మార్కాపురం జిల్లా అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సురక్ష చర్యలపై ప్రజలకు వివరించారు. అనంతరం మాక్డ్రిల్ నిర్వహించి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలో వివరించారు. రోగులను ఎలా సురక్షితంగా బయటకు తరలించాలనే అంశాలపై ప్రాక్టికల్గా ప్రదర్శించారు.