కోనసీమ: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి ప్రజా సమస్యలపై సమిష్టిగా పోరాటం చేయాలని జగన్ సూచించారని ఇజ్రాయిల్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు.