CTR: 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పుంగనూరులో ఈ ఏడాది 1512 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇందుకు సంబంధించి 8 కేంద్రాలను కేటాయించారు. మేలుపట్ల హైస్కూల్, BRG-ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బ్రాహ్మణ వీధిలోని ZP-బాలికొన్నత పాఠశాల, కొత్తయిండ్లు మున్సిపల్ హైస్కూల్, నారాయణ, బాష్యం, శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ, ZP- ఉర్దూ పాఠశాలలో పరీక్షలు జరుగుతున్నాయి.