ఏలూరు: నగరంలోని టీ పొడి దుకాణాలపై విజిలెన్సు, ఆహార భద్రత, తునకలు కొలతల శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కమిషనర్ వెంకటరత్నం మాట్లాడుతూ.. కొన్ని టీ పొడి లేబుల్స్ తేడాగా ఉండడానికి గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే శాంపుల్స్ సేకరించి ల్యాబ్కు తరలించామన్నారు. మొత్తం 3 షాపుల్లో తనిఖీలు నిర్వహించామన్నారు.