KDP: మార్చి 1న కడపలో గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులపై కీలక సమావేశం జరగనుంది. సమావేశ ఏర్పాట్లను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మేయర్ సురేష్ తదితరులు పరిశీలించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలు, కృష్ణా జలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై గట్టి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.