అన్నమయ్య: మట్లి పెద్దూరులో ఆదివారం నిర్వహించిన గంగమ్మ జాతరకు రాజంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు హాజరయ్యారు. పీఏసీ ఛైర్మన్ రాజా నాయుడు ఆహ్వానం మేరకు జాతర కార్యక్రమంలో పాల్గొని భక్తుల ఆదరణను స్వీకరించారు. గంగమ్మ చల్లని చూపులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.