KDP: ప్రభుత్వం బాలికల ఉన్నత విద్య కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ఆదివారం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా జూనియర్ కళాశాల భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల కోసం అన్ని వసతులతో కూడిన విద్యా సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.