VZM: రేగిడి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం పదవీకాలం ముగిసిన సర్పంచులకు ఘన సన్మానం నిర్వహించారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు సేవలు కొనసాగించాలని ఆయన సూచించారు. ఎంపీపీ అప్పలనరసమ్మ, వైస్ ఎంపీపీ అచ్చెం నాయుడు, ఎంపీడీవో శ్యామల కుమారి తదితరులు హాజరయ్యారు.