NDL: పాములపాడు మండలంలోని రుద్రవరంలో మొక్కజొన్న పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తలు బుధవారం పరిశీలించారు. మొక్కజొన్న పంటకు కంకులు రావడం లేదని ఫిర్యాదులు రావడంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించినట్లు సమాచారం. రైతుల నుంచి శాస్త్రవేత్తలు పలు రకాల సమాచారాన్ని సేకరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.