SKLM: మెలియాపుట్టి మండలంలో ఆదివాసి ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొని ఆదివాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల సంక్షేమం తనకు ముఖ్యమని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం మెలియాపుట్టిలో ఐటీడీఏను ఏర్పాటు చేయాలని ఆదివాసులు ఎమ్మెల్యేను కోరారు.