GNTR: వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభిస్తోంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన ఈ స్టాళ్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిరోజూ సందర్శిస్తూ ఉత్సాహంగా వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. బుధవారం మహిళా మంత్రులు స్టాళ్ల వద్ద సందడి చేశారు. నేతన్నల ఉత్పత్తులకు ప్రజాప్రతినిధుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది.