WG: భీమవరం పట్టణంలోని ఉండి రోడ్డులో వైసీపీ జిల్లా కార్యాలయాన్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం ప్రారంభించిన విషయం తెలిసందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమని విమర్శించారు. 2029లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.