KRNL: తుగ్గలి మండలంలో జొన్నగిరి గోల్డ్ మైన్స్ సంబంధిత పెండింగ్ భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఇవాళ కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గోల్డ్ మైన్స్ను కలెక్టర్ పరిశీలించారు. ఉత్పత్తి ప్రక్రియ మొత్తం విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.