BPT: కర్లపాలెం అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 8వ పోషణ పక్షోత్సవాలు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగమల్లేశ్వరి ఇందులో పాల్గొన్నారు. పిల్లలకు మొబైల్స్ ఇస్తే రేడియేషన్ వల్ల అనారోగ్యం పాలవుతారని ఆమె హెచ్చరించారు. ఫోన్లకు బదులు పిల్లలకు కథలు, పాటలు చెబుతూ వారితో సమయం గడపాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం సూపర్ డాడ్ వంటల పోటీలు నిర్వహించారు.