బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో గ్లోరియా శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులను సమగ్రంగా పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. సిబ్బంది హాజరు నమోదు, విధుల నిర్వహణ తీరును పరిశీలించిన ఆమె, కంప్యూటర్ విభాగాన్ని సందర్శించి పట్టాదారు పాసుపుస్తకాలు, కుటుంబ సభ్యుల ధృవపత్రాల దరఖాస్తులపై సమీక్ష చేశారు.