కోనసీమ: అంబాజీపేట మండలం నందంపూడికి చెందిన నేదునూరి జనార్ధనరావు (55) బుధవారం కరెంటు షాక్తో మరణించారు. కొబ్బరి దింపు తీసేందుకు చెట్టు ఎక్కుతుండగా కరెంటు తీగలపై పడిన ఎండుటాకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. షాక్కు గురై ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని గ్రామస్థులు కిందికి దించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.