కాకినాడ: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ పోటీలకు ఈ నెల 25న జట్ల ఎంపిక జరుగుతుందని కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కాకినాడ సాయి సార్ క్లబ్లో పురుషులు, మహిళల జట్లను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే పురుష క్రీడాకారులు 85 కేజీలు, మహిళా క్రీడాకారులు 75 కేజీల బరువు కలిగి ఉండాలన్నారు.