BPT: రేపల్లెలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం టీడీపీ నేత అనగాని శివప్రసాద్ ఆధ్వర్యంలో జీవనోపాధులపై సమీక్ష జరిగింది. మహిళా సంఘాల ద్వారా తాటి బెల్లం, ఎండు చేపలు, పండ్లను ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేసే ప్రణాళికపై వారు చర్చించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రేపల్లె నియోజకవర్గంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ అమలు కానుంది.