KRNL: టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేశ్ పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గంగులపాడు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బాబురావు, చిన్నతుంబళం సొసైటీ ఛైర్మన్ కందనాతి నరసప్ప హాజరయ్యారు. పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం, రాబోయే కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించినట్లు వారు పేర్కొన్నారు. క్రమశిక్షణతో పనిచేయాలని మంత్రి సూచించారన్నారు.