PPM: జనగణన 2027 ప్రక్రియలో ఖచ్చితమైన సమాచారంతో గడువుకు ముందే విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. దేశ సేవ అంటే కేవలం తుపాకీ పట్టడమే కాదని, ఇలాంటి జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం కూడా దేశ సేవకు వస్తుందని గుర్తు చేశారు. సమావేశంలో సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, తదితరులు పాల్గొన్నారు.