VKB: వృత్తి పట్ల నిబద్ధతను చాటుకుంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పుర్సంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి తన విద్యార్థుల అభ్యున్నతి కోసం తన ఒక నెల జీతం రూ. 31,040ను పాఠశాలకు విరాళంగా అందజేశారు. శుక్రవారం ఎంఈవో రామచందర్ సమక్షంలో ఈ మొత్తాన్ని బడి అభివృద్ధికి కేటాయించారు.