GNTR: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన నిర్వహణ పథకాన్ని ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుంటూరు నగరంలోని 41వ డివిజన్, స్వర్ణభారతి నగర్ మిషన్ ఫామ్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఈ తనిఖీలో పథకం అమలు తీరును పరిశీలించారు. భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.