VSP: పేదల గృహ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే 3-4 నెలలు నిర్మాణాలకు అనుకూల కాలమని, ఈలోపు లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం జరిగితే అధికారులకు నోటీసులు జారీ చేయాలన్నారు.