GNTR: ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు (EDB) నూతన కార్యాలయాన్ని మంగళగిరి హైవేలోని మయూరి టెక్ పార్క్లో మంత్రి లోకేశ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు APIIC టవర్స్ నుంచి కొనసాగిన ఈ బోర్డు కార్యకలాపాలు, ఇకపై ఇక్కడి నుంచే సాగనున్నాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈడీబీ అధికారులతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నారు.