కడప నగరంలోని ఎర్రముక్కపల్లి–విశ్వనాధపురం మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ సాధన కమిటీ ఈనెల 27న నిరసన ప్రదర్శన చేపట్టనుంది. ఉదయం 10 గంటలకు విశ్వనాధపురం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు కన్వీనర్ నాగేళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. నిధుల విడుదలలో జాప్యంపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది.