నెల్లూరుకు విచ్చేసిన మంత్రి ఫరూక్ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కావలి నియోజకవర్గంలో రహదారులు, తాగునీరు, కాలువలు, విద్యా, వైద్య సదుపాయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.