SKLM: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం పరామర్శించారు. ఇటీవల సీతారాంకు చిన్నపాటి శస్త్రచికిత్స జరిగింది. చికిత్స అనంతరం కోలుకున్న ఆయన ఆమదాలవలసలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణదాస్, తమ్మినేని నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.