కోనసీమ: యానాం ఇంధన అక్రమాలపై ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు గురువారం ధ్వజమెత్తారు. 20 వేల జనాభా ఉన్న యానాంలో రోజుకు 3 లక్షల లీటర్ల పెట్రోల్ విక్రయాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. ఈ అక్రమ రవాణా వల్ల కోనసీమ బంకు యజమానులు నష్టపోతున్నారని, సంబంధిత సంస్థల పర్మిట్లు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు