శ్రీకాకుళం: రైతులు భూముల సర్వేకు సహకరించాలని కోసమాల పీఎసీఎస్ అధ్యక్షుడు సలాన మోహన్రావు కోరారు. గురువారం మెలియాపుట్టి మండలంలో వసుంధర గ్రామములో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. భూముల రీ సర్వే అయిన తర్వాత రాజముద్రలతో రైతులకు పాసుపుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు. సరిహద్దుల సమస్యలు ఉంటే తెలియజేయాలి అన్నారు.