SKLM: జిల్లాలో పట్టుబడిన మాదక ద్రవ్యాలను అత్యంత భద్రంగా నిల్వ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. శనివారం వంశధార పాత క్వార్టర్స్లోని భవనాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, ఏఎస్పీ శ్రీనివాసరావు కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు రెవెన్యూ, పోలీస్, అధికారులు ఉన్నారు.