E.G: తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో రైతన్నా-మీకోసం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఉందని, తద్వారా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.