W.G: కొడమంచిలిలో ఈ నెల 22, 23 తేదీల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ‘పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులు’ నిర్వహించనున్నట్లు మండల అధ్యక్షుడు శ్రీనుబాబు తెలిపారు. ఈ శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవితో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.