PLD: మహంకాళి అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆలయ ప్రదక్షణ మండపంలో ‘సూర్య కాంతి స్తంభం’ స్థాపన కార్యక్రమం జరగనుంది. దీనితో పాటు అమ్మవారి 51వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవం కూడా ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.