కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామానికి చెందిన జవ్వాది సూర్యనారాయణమూర్తి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించున్నాడు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి రూ.1,01,116 విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.